
- ఆస్పత్రులకు మంత్రి దామోదర విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ రోగులకు వైద్య సేవలు నిలిపివేయొద్దని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(టీషా)కు మంత్రి దామోదర రాజనర్సింహా విజ్ఞప్తి చేశారు. ఆయా స్కీమ్ల కింద హాస్పిటళ్లకు రావాల్సిన బకాయి లను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
బకాయిలు చెల్లించనందున వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి టీషా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీషా ప్రతినిధులతో మంత్రి శనివారం ఫోన్లో చర్చలు జరిపారు. సీఎం రేవంత్తో మాట్లాడి బకాయిలు చెల్లిస్తామని, అప్పటివరకు వైద్య సేవలు కొనసాగించాలని కోరారు. మంత్రి హామీ మేరకు, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని టీషా ప్రకటించింది.