ట్రాక్టర్ నడిపి.. పొలం దున్ని

ట్రాక్టర్ నడిపి.. పొలం దున్ని

వరంగల్ రూరల్ జిల్లా : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం కాస్త రిలాక్స్ అయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో తన పొలానికి వెళ్లారు. అక్కడ పొలం పనులు చేశారు. స్వయంగా ట్రాక్టర్ నడిపి పొలం దున్నారు. తర్వాత  గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పారుశుద్ధ్యం, డ్రైనేజీని పరిశీలించారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు మంత్రి దయాకర్ రావు.