గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక జోరుగా సాగుతోంది : ఎర్రబెల్లి

గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక జోరుగా సాగుతోంది : ఎర్రబెల్లి

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి…గ్రామపంచాయతీలకు ఇప్పటికే 339 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అద్భుతంగా కొనసాగుతుందన్న మంత్రి…అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో గ్రామపంచాయతీ నిధులు తాగునీటికే సరిపోయేదన్న ఎర్రబెల్లి.. కొత్తగా 6లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమని చెప్పారు.