ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడేలా దళిత బంధు

ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడేలా దళిత బంధు

కరీంనగర్ ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడే విధంగా దళితబంధు అనే గొప్ప పథకాన్ని సీఎం తెచ్చారన్నారు మంత్రి గంగుల కమలాకర్. గురువారం ఆయన కరీంనగర్ లో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంగుల.. అంబేద్కర్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్న వాళ్లు ఓనర్లుగా అవడమనేది ఈ పథకం గొప్పతనమని.. గతంలో గుమస్తాగా ఉన్న వ్కక్తి దళితబంధుతో ఇప్పుడు ఓ టెంపోకు ఓనరయ్యాడని సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దళిత కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమం మొదలైందన్నారు. ఇవాళ నలుగురు లబ్ధి దారులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశామని.. లబ్ధిదారుల ఇష్టప్రకారమే యూనిట్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దళితబంధు ప్రారంభించడమే కాదు.. ఆ పథకాన్ని సక్సెస్ చేసి చూపించామన్నారు మంత్రి గంగుల కమలాకర్.