కరీంనగర్: తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. సోమవారం కమలాపూర్ హుజరాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు మంత్రి గంగులని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని రెండు మండలాల వారు స్పష్టం చేశారన్నారు. అబద్దాలతో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ.. ఆత్మగౌరవమంటూ మాజీమంత్రి ఈటల రాజేందర్ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న గంగుల.. హుజురాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిస్తే ఊరుకోమన్నారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యంకాదని.. పార్టిలో అందరూ సమానమే అని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.