మంజీర నదిపై చెక్ డ్యామ్ కు మంత్రి హరీశ్ శంకుస్థాపన

మంజీర నదిపై చెక్ డ్యామ్ కు మంత్రి హరీశ్ శంకుస్థాపన

మంజీర నదిపై 12.50కోట్లతో  నిర్మించిన చెక్ డ్యామ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ చెక్ డ్యామ్ తో ఐదు గ్రామాలు లబ్ధి పొందుతాయన్నారు. 2 వేల ఎకరాల ఆయకట్టుకు నీరువస్తుందని తెలిపారు. మంజీర నదిపై చెక్ డ్యామ్ కు శంకుస్థపన చేసిన తర్వాత ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ మాట్లాడుతూ…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క చెక్ డ్యామ్  మంజూరు చేయలేదు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి కాని చెక్ డ్యామ్ మంజూరు చేయలేదు. నీళ్లన్నీ వాళ్లకు కావాలి. చెక్ డ్యామ్ ఇక్కడ కడితే నీళ్లు ఆగుతాయి మాకు రావనే కుట్రతో, కక్షతో సమైక్య వాదులు చెక్ డ్యామ్ లు కట్టనివ్వలేదు. తెలంగాణ వచ్చాక, టీఆర్ఎస్ ప్రభుత్వం మంజీర నదిపై దాదాపు 15 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకున్నాం. ఈ ఘనత కేసీఆర్, టీఆర్ఎస్ ది. మంజీర నదిపై చెక్ డ్యాంలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నది 60 ఏళ్ల కల.  తెలంగాణ రాకపోతే, టీఆర్ఎస్ రాకపోతే ఒక్క చెక్ డ్యాం మంజీరపై వచ్చేది కాదు. సంగారెడ్డి జిల్లాలో ఫసల్వాది గ్రామం నుంచి చివర సర్దేన వరకు మంజీరపై 15 చెక్ డ్యాంలు మంజూరు చేయించి, వేగంగా నిర్మాణ పనులు చేపట్టాం.  ఈ 15 చెక్ డ్యాంల ద్వారా 25వేల ఎకరాలకు సాగు నీరు, మంజీర రెండువైపులా రైతు బావులు, బోర్లలో ఊట పెరిగి, భూగర్భజలాలు పెరుగుతాయి. ఇది ఓ రైతు బిడ్డగా,రైతుగా కేసీఆర్ ఆలోచించడం వల్ల ఈ చెక్ డ్యాంల కల సాకారమయింది.

1200 కోట్ల నాబార్డు నిధులతో చెక్ డ్యాంలు యుద్ధప్రాతిపదిక కాళేశ్వరం తొలి ఫలితం మరి కొద్ది రోజుల్లో మెదక్ అందుకోబోతుంది. కొండ పోచమ్మ సాగర్ కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయి.  అక్కడి నుంచి సర్దన చెక్క డ్యాం, కూచన పల్లి చెక్ డ్యాంకు కాళేశ్వరం కు నీరు వస్తాయి. బొల్లారం మత్తిడి కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరు ఇవ్వవచ్చని తెలిపారు మంత్రి హరీశ్ రావు.