మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

త్వరలోనే మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ లో నూతనంగా నిర్మించిన మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీకి సంబంధించిన ఉత్తర్వులు అందజేస్తామన్నారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువ అయ్యేలా వైద్యులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని..ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.

మరిన్ని వార్తల కోసం

ఇవాళ హైదరాబాద్ కు నిఖత్ జరీన్

పెళ్లివేడుకలో ఆడిపాడిన సైనికులు