
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని ధ్వజమెత్తారు. బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
Also Read :- తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రెండేళ్ల బాలుడు మిస్సింగ్
గజ్వేల్ లో నెలకొన్న 50 ఏళ్ళ నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారన్నారు హరీశ్ రావు. దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ట నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో కేసీఆర్ ను గెలిపించాలని గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపు నిచ్చారు.