కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరం : మంత్రి జగదీష్

కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరం : మంత్రి జగదీష్

బూర నర్సయ్య గౌడ్ రెండ్రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా తరుణ్ చుగ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి.. ఉన్నత విద్యావంతుడు అని గౌరవించిన కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బూరనర్సయ్య తీరును తప్పుబడుతూ  మంత్రి జగీదష్ రెడ్డి ట్వీట్ చేశారు.  టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ నిన్న ఢిల్లీకి వెళ్లి  బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. 

తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. .2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని తన రాజీనామా లేఖలో  బూర నర్సయ్య పేర్కొన్నారు.