విద్యుత్ సంస్థలకు వినియోగదారులే ఓనర్లు

విద్యుత్ సంస్థలకు వినియోగదారులే ఓనర్లు
  • మంత్రి జగదీశ్‌‌ రెడ్డి 

హైదరాబాద్‌‌, వెలుగు: విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులని మంత్రి జగదీశ్‌‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మింట్‌‌ కాంపౌండ్‌‌లోని సదరన్‌‌ డిస్కం కార్పొరేట్‌‌ ఆఫీసులో  48 మందికి ఏఈ జాబ్ అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్స్‌‌ అందజేశారు. 

ఈ సందర్భంగా జగదీశ్‌‌రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులపై పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించాలని ఉద్యోగులకు సూచించారు. అప్పుడే సంస్థాపరంగా అద్భుత విజయాలు సాధిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో వినియోగదారులతో అనుచితంగా ప్రవర్తించవద్దని హితవు పలికారు.