దేశంలో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది

దేశంలో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది

దేశంలో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని..అగ్నిపథ్ నిరసనలు అందుకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలతో మోడీ చేస్తున్నారని..ప్రజల సంక్షేమం మరచి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నూతన విద్యుత్ సంస్కరణలు విద్యుత్ సంస్థలకు ఉరితాళ్లేనని వ్యాఖ్యానించారు. రైతు చట్టాలపై పోరాడిన రైతులు ఇప్పుడు కేంద్ర విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. ప్రజాగ్రహం దృష్ట్యా అగ్నిపథ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ మాట్లాడేది జాతీయత చేసేది చేసేది దేశద్రోహం అని విమర్శించారు.