కాంగ్రెస్​ను గెలిపించడం అందరి బాధ్యత : మంత్రి జూపల్లి

కాంగ్రెస్​ను గెలిపించడం అందరి బాధ్యత : మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీని గెలిపించాలన్నదే అందరి బాధ్యత, కర్తవ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్​ను గెలిపించి రాహుల్​గాంధీని ప్రధాని చేయాలని ప్రజలను కోరారు. శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్​జనజాతర సభలో ఆయన మాట్లాడారు.  2004లో ప్రధాని పదవిని కూడా సోనియా తిరస్కరించారని, 2009లో అవకాశం వచ్చి నా రాహుల్ ​పదవి కోసం పాకులాడలేదని గుర్తుచేశారు. కానీ, తెలంగాణను దోచుకోవడమే ధ్యేయంగా  కేసీఆర్​ కుటుంబం పని చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికైనా పంటనష్టం ఇచ్చావా? అని కేసీఆర్​ నిలదీశారు.