అర్హులైన క‌‌ళాకారుల‌‌కు పింఛ‌‌న్లు వచ్చేలా చూస్తం : జూప‌‌ల్లి కృష్ణారావు హామీ

అర్హులైన క‌‌ళాకారుల‌‌కు పింఛ‌‌న్లు వచ్చేలా చూస్తం :  జూప‌‌ల్లి కృష్ణారావు హామీ
  • మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు హామీ

హైదరాబాద్, వెలుగు: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న  వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాన్నారు. 

శ‌‌నివారం రవీంద్ర భార‌‌తిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌‌యం ఆధ్వర్యంలో ప‌‌లువురు క‌‌ళాకారులు మంత్రి జూప‌‌ల్లిని క‌‌లిశారు. అర్హులైన వృద్ధ క‌‌ళాకారుల‌‌కు పింఛ‌‌న్ మంజూరు చేయాల‌‌ని, ఆరోగ్య బీమా స‌‌దుపాయం క‌‌ల్పించాల‌‌ని, హెల్త్ కార్డులు అందించాల‌‌ని విజ్ఞప్తి చేశారు. అర్హులైన కళాకారులందరికీ  పెన్షన్‌‌ ఇచ్చే అంశాన్ని ప‌‌రిశీస్తున్నామ‌‌ని, దీనిపై సీఎంతో చర్చించి  నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.