కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తానే చీఫ్ ఇంజినీర్ అని చెప్పుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది.. దానిపై కేసు నమోదైందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ కావచ్చన్నారు.  అందుకనే ఇక్కడి నుంచి మూటముల్లె సర్దుకొని కుటుంబంతో సహా దుబాయ్​పారిపోయేందుకు కేసీఆర్​కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటున్నది. అందుకే సీఎంగా ఉన్నప్పుడు లీజ్​కు తీసుకున్న స్పెషల్ ఫ్లైట్​ను ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదని  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్గొండలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద వింత అని కేసీఆర్ చెప్పుకున్నారని.. నిజంగానే అది మూడేళ్లలోనే కూలిపోయి వింత అనిపించుకుందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు..

2015 జూన్​లో జరిగిన కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు సమావేశంలో 811 టీఎంసీల కృష్ణా నీటిలో  తెలంగాణకు 299 టీఎంసీలు.. ఏపీకి 512 టీఎంసీల చొప్పున పంచుకునే ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టిన సంగతి వాస్తవం కాదా? అని వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టు నీళ్ల కోసం వెళ్లిన తెలంగాణ రైతుల్ని ఆంధ్రా పోలీసులు కొడుతుంటే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి పంపించిన దుర్మార్గుడు కేసీఆర్​ అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ జగన్ మనుషులకే కట్టబెట్టాడని, ఇద్దరు కలిసి కుమ్మకై.. తెలంగాణను నిండా ముంచారని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పగించిండని చెప్పడానికి కేసీఆర్​కు సిగ్గుండాలి.. నీ కమీషన్ల కోసం ఉత్తర తెలంగాణలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టినవ్.. ప్రాజెక్టులే కట్టకుండా దక్షిణ తెలంగాణను ఎడారి చేసినవ్.. మీ లిక్కర్ కేసులు మాఫీ చేయించుకునేందుకు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల ప్రయోజనాలని ఫణంగా పెట్టినవ్.. ఇన్ని చేసి ఇంకా 2 లక్షల మందితో నల్గొండలో సభ పెట్టి కృష్ణా నది నీళ్ల గురించి మాట్లాడతానని స్టేట్​మెంట్ ఇవ్వడం దారుణం’ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

Also Read : జిల్లా ఆస్పత్రిలో మెడికల్​ కాలేజీ కోసం ఏర్పాట్లు చేయండి : విమల థామస్