ప్రచార రథం పైనుంచి పడిన కేటీఆర్, ఇతర నేతలు

ప్రచార రథం పైనుంచి పడిన కేటీఆర్, ఇతర నేతలు

ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం జరిగింది. మంత్రి కేటీఆర్, జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డిలతోపాటు ఇతర నేతలు.. ప్రచార రథంపై ర్యాలీలో గా వెళుతున్నారు. ర్యాలీ వాహనం స్పీడ్ గా వెళుతున్న సమయంలో.. ఒక్కసారి బ్రేక్ వేశారు డ్రైవర్. దీంతో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర నేతలు ముందుకు పడ్డారు. కేటీఆర్ తోపాటు ఇతర నేతలు అందరూ కింద పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి.. అందర్నీ కిందకు దించారు.

ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
మంత్రి కేటీఆర్ కు చాలా స్వల్ప గాయాలు అయ్యాయని.. ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డికి కొంచెం ఎక్కువ గాయాలు అయినట్లు సమాచారం వస్తుంది. ఓపెన్ టాప్ వెహికల్ పై ర్యాలీగా వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎంపీ సురేష్ రెడ్డి అయితే పూర్తిగా కింద పడిపోయారు. మంత్రి కేటీఆర్ ముందుకు పడటంతో.. సేఫ్టీ రాడ్ కు.. మంత్రి కేటీఆర్ కడుపు గట్టిగా ఒత్తుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.