ప్రధాని మోడీ చెప్పేవన్నీ గాలి మాటలే

ప్రధాని మోడీ చెప్పేవన్నీ గాలి మాటలే

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. గ్యాస్ ధరలు తగ్గిస్తామన్న మోడీ ఇప్పుడు దాన్ని డబుల్ చేశారని విమర్శించారు. ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్ కు మొక్కి బీజేపీకి ఓటు వేయమన్న మోడీ.. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర రూ.1050కు పెంచారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పచ్చి మోసగాళ్లని విమర్శించారు. 

గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నర్సంపేట స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించామని చెప్పారు. త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.