18 వరకు టైం ఇవ్వండి..వీఆర్ఏల భేటీలో కేటీఆర్

18 వరకు టైం ఇవ్వండి..వీఆర్ఏల భేటీలో కేటీఆర్

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. కేటీఆర్ తో పాటు సీఎస్ తో చర్చించామని  వీఆర్ఏలు తెలిపారు. 23 వేల మంది వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పే స్కేల్... అర్హులకు ప్రమోషన్లు... 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు వీఆర్ఏలు. సమ్మె విరమించమని కేటీఆర్ తెలిపారన్న వీఆర్ఏలు...అయితే సమ్మె విరమించేది మాత్రం అందరితో చర్చించిన తర్వాతేనన్నారు.  సీఎం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని.. ఈ నెల 18 తేది వరకు సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు వీఆర్ఏలు తెలిపారు. సమైక్య వేడుకలు ముగిసిన తర్వాత తమ సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పారన్నారు.

ట్యాంక్ బండ్ వద్ద వీఆర్ఏలపై లాఠీచార్జ్

అంతకు ముందు వీఆర్ఏల ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు  హైదరాబాద్ కు తరలి వచ్చారు . సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఇందిపార్క్ నుంచి అసెంబ్లీ వరకు వందలాది మంది వీఆర్ఏలు ర్యాలీగా బయలు దేరారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.  తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో అక్కడే బైఠాయించిన VRAలు సర్కార్ కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే VRAలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు . దీంతో తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ధర్నాలో వందలాది మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు VRAలు. పే స్కేల్ ప్రకటించాలన్నారు.