కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా విభజన హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు.కేంద్ర సర్కారు సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు. డిమాండ్లను సాధించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..