అర్హులందరికి డబుల్ ఇండ్లు : మహేందర్ రెడ్డి

అర్హులందరికి డబుల్ ఇండ్లు :  మహేందర్ రెడ్డి

శంకర్ పల్లి, వెలుగు :  అర్హులందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు భూగర్భవనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.  సోమవారం శంకర్ పల్లి పట్టణ శివారులో రూ. 130 కోట్ల 79 లక్షలతో నిర్మించిన 1,512 డబుల్ ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, కేటాయించిన ఇళ్లలో ఉండి జీవనం సాగించాలని విజ్ఞప్తి చేశారు.

 ఇండ్లు అమ్ముకుంటే రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, తహశీల్దార్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, శంకర్ పల్లి మున్సిపల్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వాసుదేవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.