సూరారంలో కొత్త పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

సూరారంలో కొత్త పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 60 నుంచి 70 పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉన్నాయని.. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా 70 పీఎస్ లు అయ్యాయని  మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ లో కొత్తగా 9 పీఎస్ లు 2 డీసీపీ ఆఫీస్ లు, 3 ఏసీపీ ఆఫీసులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, హోంమంత్రి మహ్మద్ ఆలీకి ధన్యవాదాలు తెలియజేశారు.

గతంలో సూరారంలో విచ్చలవిడిగా క్రైమ్ జరిగేదని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కొత్త పోలీస్ స్టేషన్ తో పూర్తిగా నేర నియంత్రణ కట్టడి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సూరారం పోలీస్ స్టేషన్ ను ముఖ్య అతిథిగా హజరై పీఎస్ ను ప్రారంభించారు.