ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం : మల్లారెడ్డి

ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం : మల్లారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఆయా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్షమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ప్రజలు కంటి సమస్యలతో ఇబ్బందులు పడొద్దనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభించారని తెలిపారు. 1500 టీంలతో కంటివెలుగు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడా లేదని.. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.