టీఆర్ఎస్ అంటే గులాబీ పూలు అనుకున్నారా?. ఫైర్..ఫైర్ బ్రాండ్

టీఆర్ఎస్ అంటే గులాబీ పూలు అనుకున్నారా?. ఫైర్..ఫైర్ బ్రాండ్

తనలా కష్టపడి ఎదగాలని విద్యార్థులకు సూచించారు మంత్రి మల్లారెడ్డి. కండ్లకోయలో ఐటీ టవర్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు మల్లారెడ్డి. ఈ సందర్బంగా స్టూడెంట్స్ ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రతీ ఒక్క స్టూడెంట్ తన లాగా కష్టపడి పైకి రావాలన్నారు.  ఒకప్పుడు తాను పాలు అమ్మినని, పూలు అమ్మినని..  సండే, మండే తేడా లేకుండా కష్టపడ్డానన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల మంత్రిని అయినా అని అన్నారు.  సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ..  ‘స్కూల్స్ పెట్టిన కాలేజీలు పెట్టినా, ఎంపీ అయిన, ఎమ్మెల్యే అయిన, మంత్రి అయిన. కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల ఈ స్టేజి లో ఉన్న..ఇపుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అయిన, టాప్ టెన్ లో ఉన్న..స్టూడెంట్స్ టైమ్, డబ్బులు వేస్ట్ చేయద్దు... ప్రేమలో పడద్దు, దొంగ ఫ్రెండ్షిప్ చేయద్దు. కేటీఆర్ స్మార్ట్ మినిస్టర్... ఇండియాలోనే నంబర్ వన్ ఐటీ మినిస్టర్. ఒకపుడు ఐటీ పార్క్ ఐటీ కంపెనీలు అన్నీ నార్త్ లోనే ఉండేవి.. ఇప్పుడు సౌత్ కు వస్తున్నాయి...ఇది మన అదృష్టం. కొంపల్లి - మేడ్చల్ చుట్టూ లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. టీఆర్ఎస్ అంటే గులాబీ పూలు అనుకున్నారా... ఫైర్... ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదు. బీజేపీ, కాంగ్రెస్ పోటీ రాలేవు. కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇండియాలో ఆపిల్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్నింట్లో మనమే బెస్ట్ ఉన్నాం. కేటీఆర్ వల్ల హైదరాబాద్ కు చాలా కంపెనీలు వస్తున్నాయి’ అని అన్నారు.

మరిన్ని వివరాల కోసం

భగవంత్ మాన్  ఓ తాగుబోతు 

రోజుకి 12,000 మంది పేషెంట్స్​కి  బ్లడ్​ దొరకట్లేదు

రూపాయికే గులాబీ దోశ