రోజుకి 12,000 మంది పేషెంట్స్​కి  బ్లడ్​ దొరకట్లేదు

రోజుకి 12,000 మంది పేషెంట్స్​కి  బ్లడ్​ దొరకట్లేదు

టైంకి బ్లడ్​ అందించాలని..

అయినోళ్లకి రక్తం ఇవ్వాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తరు కొందరు. అలాంటిది స్వార్థం హద్దులు చెరిపేసి... ఆపదలో ఉన్నోళ్లని వెతుక్కుంటూ వెళ్లి మరీ బ్లడ్​ డొనేట్​ చేస్తున్నాడు కిరణ్​ వర్మ. బ్లడ్​ డొనేషన్​ పై అవేర్​నెస్​ కల్పించడానికి 21, 000 కిలోమీటర్ల జర్నీని కూడా మొదలు పెట్టాడు. ఇంతకుముందు కూడా ఇలా 16వేల కిలోమీటర్లు తిరిగాడు. ‘సింప్లీ బ్లడ్’ అనే వర్చు వల్​ బ్లడ్​ డొనేషన్​ ప్లాట్​ఫాంని క్రియేట్​ చేసిన ఈ ఢిల్లీ అబ్బాయి ఈ పని మొదలుపెట్టింది ఇలా..

మన దేశంలో రోజుకి 12,000 మంది పేషెంట్స్​కి  టైంకి బ్లడ్​ దొరకట్లేదు. దీనివల్ల ఏటా 40 లక్షల మందికి పైగా  ప్రాణాలు కోల్పోతున్నారు. 133 కోట్ల జనాభాలో కనీసం ఐదు కోట్లమంది రక్తదానానికి ముందుకొచ్చినా ఈ పరిస్థితి రాదు. ఈ విషయాన్నే అందరికీ చెప్పాలనుకున్నా.  బ్లడ్​ డొనేషన్​పై అవేర్​నెస్​ కల్పించడానికే 16, 000 కిలోమీటర్లు తిరిగా. ఐదేండ్ల  కిందట ‘సింప్లీ బ్లడ్’ అనే వర్చువల్​ బ్లడ్​ డొనేషన్​ ప్లాట్​ఫాంని క్రియేట్ చేశా.  ఇప్పుడు 21వేల కిలోమీటర్ల టార్గెట్​తో జర్నీ  మొదలుపెట్టా. ఈ ఆలోచన వెనక ఉంది మాత్రం మా అమ్మ.

ఆలోచింపజేశాయి
టైంకి బ్లడ్​ అందక మా అమ్మ చనిపోయింది. అప్పట్నించి మా కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరొకరికి రావద్దని అవసరమున్న వాళ్లకి కాదనకుండా బ్లడ్ ఇస్తున్నా.  సరిగ్గా ఐదేండ్ల కిందట తెలియని నెంబర్​ నుంచి బ్లడ్​ కావాలని నాకు ఫోన్​ వచ్చింది. వెంటనే వెళ్లి రక్తం ఇచ్చా. కానీ, ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్​ అరేంజ్​ చేసిన వ్యక్తి నేను​ డొనేట్ చేసిన బ్లడ్​ని రూ. 1500కి ఒక పేద కుటుంబానికి అమ్మాడు. హాస్పిటల్​, బ్లడ్​కి డబ్బులు కట్టడానికి ఆ పేషెంట్​ భార్య ప్రాస్టిట్యూషన్​లోకి దిగింది. ఆ విషయం తెలిశాక చాలా రోజులు నిద్రపట్టలేదు.  బ్లడ్​ బ్లాక్​ చెయిన్​ని ఆపేందుకు  ఏదైనా చేయాలనుకున్నా. ఆ ఆలోచనతోనే 2017 లో  ‘సింప్లీ బ్లడ్​’ అనే వర్చువల్​  ప్లాట్​ఫాంని క్రియేట్​ చేశా.  ప్రస్తుతం ఇందులో180 దేశాల నుంచి కొన్ని వేలమంది డోనర్స్​ రిజిస్టర్​ అయి ఉన్నారు.

ఈ ఇన్సిడెంట్​ తర్వాత క్యాన్సర్​తో బాధపడుతున్న పిల్లాడికి బ్లడ్​ ఇచ్చా​. కొద్దిరోజుల తర్వాత ఆ పిల్లాడు కోలుకున్నాడో లేదో తెలుసుకోవడానికి వాళ్ల ఇంటికి ఫోన్​ చేశా.  ప్లేట్​లెట్​ డోనర్​ దొరక్క ఆ పిల్లాడు చనిపోయాడని చెప్పారు ఇంట్లోవాళ్లు. రెండు కోట్ల మంది ఉన్న ఢిల్లీలో ఒక్కరు కూడా ఆ పిల్లాడికి రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేదన్న ఆలోచన నన్ను ఆలోచింపజేసింది.  సొసైటీలో మార్పు తేవాలనుకున్నా. కానీ, చేతిలో సరిపడా డబ్బు లేదు. అయినా వెనకడుగేయలేదు. నా వంతు ప్రయత్నంగా అవేర్​నెస్​ కల్పించడానికి నడక మొదలుపెట్టా.

అదే నా టార్గెట్​
జనవరి 26, 2018 లో శ్రీనగర్​లోని లాల్​ చౌక్​లో నా ప్రయాణం మొదలైంది. ఆ ఏడాది 16, 000 కిలోమీటర్లు ప్రయాణించా. వాటిల్లో  ఆరువేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లా. కాలేజీలు, యూనివర్సిటీలు, రెస్టారెంట్స్​, మాల్స్​, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్​లో అవేర్​నెస్​ క్యాంపులు​ కండక్ట్​ చేశాడు. ప్రతి కిలోమీటర్​కి కనీసం పదిమందిని రక్తదానానికి ఒప్పించాలన్న లక్ష్యంతో మొదలైన  నా జర్నీ ఇప్పుడు 21, 000 కి.మీ  టార్గెట్​తో మళ్లీ మొదలైంది. డిసెంబర్ 31, 2025 నాటికి  దేశ వ్యాప్తంగా రక్తం అందక ఎవరూ చనిపోకూడదనేదే నా ఆశయం. అందుకోసం మారుమూల ప్రాంతాల్లోనూ గల్లీగల్లీ తిరుగుతున్నా. దీంతో పాటు ఢిల్లీలో ‘వన్​ మీల్’​ అనే స్కీమ్​ని కూడా మొదలుపెట్టా. దీని ద్వారా రూ. 10 రూపాయలకే పేదవాళ్లకు కడుపునిండా భోజనం పెడుతున్నా.  ఫ్యూచర్​లో ఈ సేవల్ని మరింత విస్తరించాలనుకుంటున్నా.