అర్హులందరికీ రుణమాఫీ చేస్తం: నిరంజన్‌రెడ్డి

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.34 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.11,812.14 కోట్ల రుణాలను మాఫీ చేశామని ఆయన ప్రకటించారు. బుధవారం సెక్రటేరియట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు అకౌంట్‌ క్లోజ్‌ కావడం, టెక్నికల్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నా  రైతులందరీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. 

సమస్యలున్న రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, సందేహాలు ఉంటే 040 –23243667 నెంబరుకు ఫోన్‌ చేయొచ్చన్నారు. కాగా ఈ  ఈ సీజన్‌లో వరి 65 లక్షల ఎకరాల్లో సాగైందనీ, ఇదే  ఇప్పటి వరకు  రాష్ట్ర చరిత్రలో  రికార్డ్ సాగు అని తెలిపారు.