హైదరాబాద్ సిటీ, వెలుగు : దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని, భవిష్యత్తులో హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్లో జీహెచ్ఎంసీ కమిషనర్కర్ణన్తో కలిసి మొక్కలు నాటారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే పర్యావరణ కార్యక్రమాలను ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్లే నగరాల్లో డంప్ యార్డ్ సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. స్టీల్ పాత్రలు, గ్లాస్లు వాడాలని సూచించారు. బల్దియా కమిషనర్కర్ణన్మాట్లాడుతూ.. ప్రతి చిన్న పనికి వాహనాన్ని వాడడం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని, నడుచుకుంటూ వెళ్లడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు.
