ఖమ్మంలో గతంలో ఎవరూ చేయలేని పనులు తాము చేశామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఆగమైతే దానిని కాపాడింది కేసీఆర్ అని.. నష్టపోతే ప్రభుత్వంలో విలీనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు.
76 ఏండ్లల్లో ఖమ్మానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని.. సీఎం చొరవతో తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు పువ్వాడ. అందుకే ఖమ్మంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. అన్నీ సర్వేలు కూడా 99 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఖమ్మం ప్రజలు ఆగం కావొద్దని ఈ సారి ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.