బతుకమ్మ గురించి ప్రపంచానికి తెలియజేసింది కేసీఆరే: సబితా ఇంద్రారెడ్డి

బతుకమ్మ గురించి ప్రపంచానికి తెలియజేసింది కేసీఆరే: సబితా ఇంద్రారెడ్డి

ప్రపంచానికి బతుకమ్మ పండుగను తెలియజేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బోడుప్పల్ కార్పొరేషన్ లో జరిగిన సదస్సులో మాట్లాడిన సబిత..  బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని 50శాతం రిజర్వేషన్ ను కల్పించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు.

మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అందించనున్నమని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. వి హబ్ ద్వారా మహిళా ఔత్సాహిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నమని చెప్పారు. మహిళలకు షీ టీమ్స్ తో భద్రత కల్పించిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. ప్రతి స్కూల్ లో ఆడ పిల్లలకు కరాటే లో శిక్షణ ఇస్తున్నమని… మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలుపెట్టాలని చెప్పారు… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బోడుప్పల్ లోని 28 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని ఆమె కోరారు. మీ అందరిని చూస్తే గెలుపు కాదు.. మెజారిటీ ఎంత అనేది చూడాలని అనుకుంటున్నానని సబిత ఇంద్రారెడ్డి అన్నారు.