ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె : సీతక్క

ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె : సీతక్క

ఎండ తీవ్రత అధికంగా ఉందని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని కోరారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. తగిన  జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని లేక పోతే రావద్దని మంత్రి సూచించారు.