ఎవరో గొట్టంగాళ్లు పిలిస్తే మేము రాము

ఎవరో గొట్టంగాళ్లు పిలిస్తే మేము రాము

ఎమ్మెల్సీగా ఎవరు గెలిచినా ఏమీ చేయలేరన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉద్యోగాలు, ప్రమోషన్స్  రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాదన్నారు. తాము ఇంకో మూడు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామన్నారు. 30 సంవత్స రాలు నుండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చామన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారి లక్ష 32వేల 980 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.  గొల్ల కుర్మలపై , ఉద్యోగుల భర్తీపైన ఎవరో గొట్టంగాళ్లు పిలిస్తే తాము రామని… పిలిచే వాళ్ళ స్థాయిని బట్టి తమ సమాధానం ఉంటుందన్నారు. ఆర్టీఐ నుండి సమాచారం తీసుకొని ఉద్యోగాల భర్తీపై మాట్లాడాలన్నారు. పీఆర్సీపై కమిటీ కూడా వేసామని.. త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. అదనంగా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారన్నారు తలసాని.