టికెట్ల రేట్లు పెంచలేదు.. యధాతథం: తలసాని

టికెట్ల రేట్లు పెంచలేదు.. యధాతథం: తలసాని

సినిమా టికెట్ల ధరలు పెంచలేదని, ధరల పెంచుతున్నట్టు వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని రాష్ట్ర సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  టికెట్  ధరల పెంపు విషయంలో థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

అంతకుముందు ప్రభుత్వ అనుమతులతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలకు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలు థియేటర్ల  యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే  ఆ ప్రకటనల్లోనూ, వివిధ ప్రసార మాధ్యమాలు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది.