చంద్రబాబు మీటింగ్ లో వీటిని డిమాండ్ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల లేఖ

చంద్రబాబు మీటింగ్ లో వీటిని డిమాండ్ చేయండి..  సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజాభవన్ లో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా  భేటీలో ఏపీసీఎం చంద్రబాబుతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.   కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల  దర్శనం కోసం వెళ్ళే భక్తులకు వసతి..  దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేయాలని  కోరారు.

ఇద్దరు సీఎంల మీటింగ్ కు సంబంధించి ఎజెండా ఇప్పటికే ఖరారు చేశారు రెండు రాష్ట్రాల అధికారులు. విజభన సమస్యలతో పాటు పెండింగ్ లో ఉన్న అంశాలపై జాబితా సిద్ధం చేశారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి అటెండ్ అవుతారని తెలుస్తోంది. అటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మరో ముగ్గురు మంత్రులు మీటింగ్ కు  వస్తారని సమాచారం.