రుణమాఫీపై అపోహలు వద్దు... క్లారిటీ ఇస్తాం: తుమ్మల నాగేశ్వర్ రావు

రుణమాఫీపై అపోహలు వద్దు... క్లారిటీ ఇస్తాం: తుమ్మల నాగేశ్వర్ రావు

రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.  రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్పారు.  రాష్ట్రంలో  ప్రతి రైతు అకౌంట్ నంబర్లు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. రుణమాఫీ కాని వారికి ఎందుకు కాలేదో..ఎప్పుడు అయితుందో క్లారిటీ ఇస్తామన్నారు.  రూ. 2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని తెలిపారు.  ప్రతి రైతు కుటుంబాన్ని రుణవిముక్తి చేస్తామన్నారు. రుణమాఫీపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.  చారిత్రాత్మకమైన కార్యక్రమంపై బురద జల్లొద్దని చెప్పారు. రుణమాఫీపై రైతులకు ఎవరికి అనుమానాలు ఉన్నా క్లారిఫై ఇస్తామని తెలిపారు  తుమ్మల.
 
 తెలంగాణ ప్రభుత్వం జూలై 18న  రూ.లక్ష వరకు  రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన 11 లక్షల 50 వేల మంది రైతులకు 6098 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. లక్షన్నర వరకు జూలై 30 వరకు లక్షన్నర నుంచి రెండు లక్షల రుణాలు ఉన్న రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ చెప్పిన సంగతి తెలిసిందే.