చిట్యాలలో యోగా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాలలో యోగా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల, వెలుగు : యోగా మాసోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా మాసోత్సవాల సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్​ను బుధవారం చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజీ నుంచి గ్రామంలోకి కోటీ 16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో జరుగుతున్న రేణుకాఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, డెయిరీ డెవలప్​మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.