ట్రిపుల్ ఆర్బాధితుల అరెస్టు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ట్రిపుల్ ఆర్ కారణంగా భూములు కోల్పోనున్న బాధితుల్లో యాక్టివ్గా ఉన్నవారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్ తంగెళ్లపల్లి రవికుమార్ను హౌస్అరెస్ట్ చేయడంతో పాటు మంత్రులను కలవడానికి వచ్చిన రైతులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్స్టేషన్ కిక్కిరిసిపోయింది.
మంత్రులను కలవబోతే..
గురువారం యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిని కలవడానికి రైతులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫారెస్ట్బిల్డింగ్వద్దకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్చేశారు. అనుమతి లేనప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ వారిని ప్రశ్నించారు. కొందరు మహిళా రైతులు ఆటోలో రాగా పోలీసులు చుట్టుముట్టి కిందికి కూడా దిగనీయలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి వారిని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టుల విషయం తెలుసుకున్న యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి పోలీస్స్టేషన్కు వచ్చి వారిని పరామర్శించారు. మంత్రులు వెళ్లిపోయిన తర్వాత వదిలేశారు.
అందరూ రోడ్డు కావాలంటే.. మీరొద్దంటున్నారేంది?
అందరూ రోడ్లు కావాలంటుంటే మీరు వద్దంటున్నారేంది అని తనను కలిసిన రాయపర్తి రైతులతో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బాధితుల నుంచి ఐదుగురిని పిలిపించుకున్న మంత్రి జగదీశ్రెడ్డి వారితో మాట్లాడారు. తాము ఇప్పటికే నాలుగుసార్లు భూములను కోల్పోయామని, ఇప్పుడు ట్రిపుల్ఆర్కారణంగా ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నామన్నారు.