ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్బయ ఘటన జరిగింది. అదే తరహాలో.. మధ్యప్రదేశ్లో కూడా బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన బియోరా బస్స్టాండ్లో ఆగి ఉన్న బస్సులో గురువారం జరిగింది. ఇండోరుకు వెళ్తున్న బాలికను నిందితులు బెదిరించి అత్యాచారం చేశారు. ఇండోరుకు వెళ్తున్న మైనర్ అయిన తన కూతురు తప్పిపోయిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అమ్మాయిని వెతికే పనిలో భాగంగా బియోరా బస్స్టాండ్కు వెళ్లారు. అక్కడ మైనర్ బాలిక ఇద్దరు వ్యక్తులతో కనిపించింది. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు తనపై అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎన్కె నహర్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
For More News..