
హైదరాబాద్ కాంచన్బాగ్లో ఉన్న మినీరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24.
పోస్టుల సంఖ్య: 23.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ) 08, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) 08, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 01, అసిస్టెంట్
మేనేజర్ (రిఫైనరీ మెయింటెనెన్స్) 01, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ – నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్) 01, అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్) 04.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ల సంఖ్య అధికంగా ఉంటే రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు midhani-india.in వెబ్సైట్లో చూడవచ్చు.