హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా సెలక్షన్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్  మిధానిలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా సెలక్షన్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ కాంచన్​బాగ్​లో ఉన్న మినీరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24. 

పోస్టుల సంఖ్య: 23.

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ) 08, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) 08, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 01, అసిస్టెంట్ 
మేనేజర్ (రిఫైనరీ మెయింటెనెన్స్) 01, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ – నెట్​వర్క్ అడ్మినిస్ట్రేటర్) 01, అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్​మెంట్) 04. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట  వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ల సంఖ్య అధికంగా ఉంటే రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు. 

పూర్తి వివరాలకు midhani-india.in వెబ్​సైట్​లో చూడవచ్చు.