ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారి సేఫ్​

ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారి సేఫ్​

శంషాబాద్, వెలుగు:  ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని ఆరు గంటల్లోనే పోలీసులు వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మైలార్ దేవ్ పల్లిలో జరిగింది. బిహార్ కు చెందిన సోను, రూప దేవి దంపతులు కొంతకాలం కిందట సిటీకి వచ్చి మైలార్ దేవ్ పల్లి డివిజన్ దుర్గా నగర్ లో ఉంటున్నారు. వీరికి శివాని(5) కూతురు ఉంది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ మంగళవారం ఉదయం  తప్పిపోగా వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్​ చేశారు. దుర్గా కన్వెన్షన్ సమీపంలో తిరుగుతుండగా స్థానికులు తీసుకెళ్లి మైలార్ దేవ్ పల్లి  పోలీసుల రక్షణలో ఉంచారు. చిన్నారి తల్లిదండ్రులను రప్పించి పోలీసులు అప్పగించారు.