మియాపూర్, వెలుగు: మియాపూర్మెయిన్రోడ్డు వెంట ఉన్న ఫర్నిచర్షాపులు, గుడిసెలను భారీ పోలీసు బందోబస్తు మధ్య సైబరాబాద్మున్సిపల్కార్పొరేషన్అధికారులు గురువారం జేసీబీలతో తొలగించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగిస్తున్నారని షాపుల నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. త్వరలో మియాపూర్నుంచి అల్విన్క్రాస్ రోడ్డు వరకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వస్తున్న నేపథ్యంలో రోడ్డును క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
