ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : ఎమ్మెల్యే బాలూనాయక్

 ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : ఎమ్మెల్యే బాలూనాయక్
  • ఎమ్మెల్యే బాలూనాయక్  

దేవరకొండ (చందంపేట), వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఎమ్మెల్యే బాలూనాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం చందంపేట మండలంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో చందంపేట ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. 

అనంతరం చందంపేట మండలం పెద్దమూల గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సమావేశంలో జిల్లా పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్​ చైర్మన్  శ్రీశైలం, మాజీ జడ్పీటీసీ లచ్చిరాం, మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్, సర్వయ్య, మండల పార్టీ అధ్యక్షుడే బద్యనాయక్, నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.