ప్రశ్నించిన వ్యక్తికి గొర్రెల ఇవ్వొద్దన్న ఎమ్మెల్యే

ప్రశ్నించిన వ్యక్తికి గొర్రెల ఇవ్వొద్దన్న ఎమ్మెల్యే
  • ఆయనకు మాత్రం గొర్రెలు ఇయ్యకున్రి
  • గొర్రెల పంపిణీ ఇంకెప్పుడని ప్రశ్నించిన వ్యక్తిపై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం

రాజాపేట, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీ ఇంకెప్పుడని గొర్రెల కాపరి ఒకరు ప్రశ్నించినందుకు.. ఆయనకు గొర్రెలు ఇచ్చుడే వద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో రైతు వేదిక భవనం ప్రారంభోత్స వం తర్వాత ఎమ్మెల్యే మాట్లాడు తుండగా.. కాకల్ల ఐలయ్య అనే గొర్రెల కాపరి రెండో విడత గొర్లు ఇంకెప్పుడిస్తరని నిలదీశాడు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సునీత.. ‘సీఎం కేసీఆర్ గొర్రెలు పంపిణీ చేస్తరు. ఇట్ల ప్రశ్నిస్తున్నవ్ కాబట్టి ఈసారి గొర్రెలు తీసుకోకు’ అని ఐలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మాత్రం గొర్రెలు ఇయ్యకున్రి అని ఆఫీసర్లను ఆదేశించారు.