కల్వకుర్తి, వెలుగు : ఎర్రవల్లి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవితో శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఎర్రవల్లి భూనిర్వాసితులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యను వివరించారు.
