కష్టపడిన వారికే పార్టీలో పదవులు : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

కష్టపడిన వారికే పార్టీలో పదవులు : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు : పార్టీ బలోపేతం కోసం కష్టపడే కార్యకర్తలకే పదవులు వస్తాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరిలో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశించిన వారందరికీ పదవులు రావన్న సంగతిని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. అయితే 2017 నుంచి పార్టీలో కష్టపడిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. అందరం కలిసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

కార్యకర్తలకు తనకు కొంత గ్యాప్​ వచ్చినమాట వాస్తవమేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పర్యటనలు చేస్తున్నందున గ్యాప్ ఏర్పడిందన్నారు. అయితే ఆ గ్యాప్​ను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్​లో అర్హులైన కార్యకర్తలకు అవకాశం ఉంటుందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుసాగుతోందని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి,  నియోజకవర్గ కో–ఆర్డినేటర్​పులి అనిల్, తంగెళ్లపల్లి రవికుమార్, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.