కేసీఆర్​కన్నా ఒక్క జాబ్​ ఎక్కువిచ్చినా ముక్కు నేలకు రాస్తా: పాడి కౌశిక్​రెడ్డి

కేసీఆర్​కన్నా ఒక్క జాబ్​ ఎక్కువిచ్చినా ముక్కు నేలకు రాస్తా: పాడి కౌశిక్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​కన్నా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చి ఉంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే మాణిక్​ రావుతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. కేసీఆర్​హయాంలో ఇచ్చిన ఉద్యోగాల వివరాలన్నీ బయట పెడుతున్నానని, రేవంత్​ పోస్టింగ్​లు ఇచ్చిన నర్సింగ్​ఆఫీసర్ల నోటిఫికేషన్​ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందేనని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్​ కొత్త ఇన్నింగ్స్​ప్రారంభిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్​ప్రకటించిన జాబ్​ క్యాలెండర్​ ప్రకారం ఫిబ్రవరి ఒకటిన గ్రూప్​–1 నోటిఫికేషన్ ​ఇవ్వాలని, ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.