
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్కన్నా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చి ఉంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్హయాంలో ఇచ్చిన ఉద్యోగాల వివరాలన్నీ బయట పెడుతున్నానని, రేవంత్ పోస్టింగ్లు ఇచ్చిన నర్సింగ్ఆఫీసర్ల నోటిఫికేషన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందేనని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కొత్త ఇన్నింగ్స్ప్రారంభిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఒకటిన గ్రూప్–1 నోటిఫికేషన్ ఇవ్వాలని, ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.