తెలంగాణ భవన్ లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చేవెళ్ల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ పై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ కు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అటెండ్ కాలేదు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ తో ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. ప్రకాశ్ గౌడ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతల రాజకీయాలపై ఎప్పుడు ఎలాంటి పరినామా జరుగుతాయోనని ప్రజలు ఆసక్తగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తాను ఉన్నని రోజులు బీఆర్ఎస్లోనే ఉంటానని ఎమ్మెల్యే కాలె యాదయ్య చెప్పారు. కాంగ్రెస్లోకి రమ్మని తనకు ఆహ్వానించారని, కానీ తాను పార్టీ మారానని తేల్చి చెప్పారు. రాజకీయాలు శాశ్వతం కాదన్న కాలే యాదయ్య.. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కేసిఆర్ ఆశీస్సులతో రెండు సార్లు గెలిచానని చెప్పారు కాలె యాదయ్య.