దుబ్బాకకు నిధులిస్తలేరని హైకోర్టుకు రఘునందన్

దుబ్బాకకు నిధులిస్తలేరని హైకోర్టుకు  రఘునందన్

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను దుబ్బాకకు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాకకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. కేవలం సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే SDFను కేటాయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. రఘునందన్ పిటిషన్ను విచారణకు  స్వీకరించిన హైకోర్టు.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, GAD ముఖ్యకార్యదర్శి, సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు, R &B అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది.