బిల్లులపై గవర్నర్ సంతకం చేయకపోతే బీజేపీకి ఏం సంబంధం

బిల్లులపై గవర్నర్ సంతకం చేయకపోతే బీజేపీకి ఏం సంబంధం

గవర్నర్ ప్రభుత్వ బిల్లులపై సంతకాలు పెట్టకపోతే బీజేపీ పార్టీకి ఏం సంబంధం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. TSPSC పేపర్ లీకేజీ నుంచి దృష్టిని మరల్చేందుకే మంత్రి హరీష్ రావు బీజేపీపి బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు నోరు తెరిస్తే అబద్దాలే చెప్తారని విమర్శించారు. హరీష్ రావు ఏనాడైనా నిజాలు చెప్పినవా అని ప్రశ్నించారు. 

బీజేపీకి హరీష్ రావు సంస్కారం నేర్పాల్సిన అవసరం లేదని రఘు నందన్ రావు అన్నారు. గవర్నర్ బిల్లులపై సంతకం పెట్టకుండా బీజేపీ ఆపుతుందన్న ఆయన మాటల్లోనే సంస్కారం కనబడుతుందని ఎద్దేవా చేశారు. గవర్నర్ ఒక మహిళ అని చూడకుండా అగౌరవ పరిచారని విమర్శించారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ అనవసర మాటలు వద్దు అంటూ హితవు పలికారు. వ్యవస్థలను నాశనం చేస్తుంది బీజేపీ కాదని.. బిఅర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బీజేపీపై అసత్య ప్రచారాలు చేసి... ప్రజల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.