కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి :  ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బల్దియా పరిధిలోని పలు డివిజన్లకు చెందిన లీడర్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. చేరిన వారిలో మాజీ కో ఆప్షన్​సభ్యుడు వంగ శ్రీనివాస్​, 44వ డివిజన్‌‌‌‌‌‌‌‌కు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ యూత్​ వింగ్​ సభ్యులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇప్పటికే 33వ డివిజన్​ బీఆర్ఎస్​ అభ్యర్థి కుమ్మరి శ్రీనివాస్​, 36వ డివిజన్​ బీఆర్ఎస్​ అభ్యర్థి గాదం విజయ, లీడర్లు పీఎస్​ అమరేందర్​, మాజీ కార్పొరేటర్​ సింహాచలం రత్నాకర్​, మాజీ కో ఆప్షన్​ సభ్యుడు ఎండీ రఫీక్​, బిజినెస్​మెన్​ తూముల రాజేశ్వర్​రావు చేరడంతో కాంగ్రెస్ బలం పెరిగింది.