టికెట్ ఇవ్వలేదని వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే

టికెట్ ఇవ్వలేదని వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే

స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. 

రాజయ్యకు అనుకూలంగా అభిమానులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను చూసి కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని ఓదారుస్తూ ఎమ్మెల్యే కూడా భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో నాకు టికెట్ రాకుండా చేశారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ గీసీన గీత దాటనని.. తనకు కేసీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఆయన అన్నారు. తాను సీఎం కేసీఆర్ కు విధేయుడినని తెలిపారు. నేనెప్పుడు ప్రజలతోనే ఉంటా.. నాభవిష్యత్ పెద్దాయన చేతుల్లో ఉందని రాజయ్య చెప్పుకచ్చారు.