అప్లికేషన్లు సరిపోట్లేదు .. ప్రజాపాలన ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్

అప్లికేషన్లు సరిపోట్లేదు .. ప్రజాపాలన ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు చేసిన  ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ అయ్యారు. ప్రజాపాలనలో ఆరు గ్యారంటీ స్కీమ్ లకు అప్లై చేసుకునేందుకు ఒక్కో సెంటర్ కు వందల మంది వస్తున్నారని తెలిపారు. 

అయితే, ప్రభుత్వం 200 అప్లికేషన్లను మాత్రం అందుబాటులో ఉంచిందని విమర్శించారు. ఒక్కో సెంటర్ లో 2 వేల నుంచి 3 వేల అప్లికేషన్లు అందుబాటులో ఉంచాలని గురువారం పత్రిక ప్రకటనలో రాజా సింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్లను అందుబాటులో ఉంచకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు.