మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఏ పార్టీ నుంచి మంత్రి అయ్యారో చెప్పాలని పువ్వాడకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకుంటే పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే అయ్యేవారా? అంటు ప్రశ్నించారు. ఖమ్మం అంటేనే పోరాటాల గడ్డ, కాంగ్రెస్ కు అడ్డా అని అన్నారు.
ఖమ్మంలో జరగనున్న జన గర్జన సభకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందని వాటన్నిటిని లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రేపు ఖమ్మం గుమ్మంలో అడుగుపెడుతున్నారని అన్నారు. కేంద్ర,రాష్ట్ర విధివిధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి జనం మద్దతివ్వాలని కోరారు.